ఆది కొత్త చిత్రం ప్రారంభమయ్యింది
- June 11, 2015
సునీల్ హీరోగా నటించిన విజయవంతమైన చిత్రాల్లో 'పూలరంగడు' ఒకటి. దానికి వీరభద్రమ్ చౌదరి దర్శకుడు. వాస్తవానికి ఆ చిత్రంలో ఆది హీరోగా నటించాల్సింది.కానీ, అప్పటికి ఆ కాంబినేషన్ కుదరలేదు. 'చుట్టాలబ్బాయ్' చిత్రంతో ఇప్పటికి కుదిరింది. రామ్ తాళ్లూరి సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో వెంకట్ తలారి నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం హైదరాబాద్లో ఆరంభమైంది.ముహూర్తపు దృశ్యానికి రచయిత గోపీమోహన్ కెమెరా స్విచాన్ చేయగా, నటుడు సాయికుమార్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ''సాయికుమార్గారికి, ఆదికి ఈ కథ బాగా నచ్చింది. నా దర్శకత్వంలో వచ్చిన 'అహ నా పెళ్లంట', 'పూలరంగడు' తరహాలో ఈ చిత్రం కూడా పూర్తి స్థాయి వినోదంతో సాగుతుంది. అయితే, ఇందులో యాక్షన్ కూడా ఉంటుంది'' అన్నారు.అన్ని రకాల భావోద్వేగాలూ ఉన్న సినిమా అనీ, తన సినిమాకు థమన్ తొలిసారిగా పాటలిస్తున్నారనీ ఆది చెప్పారు. ఈ ఏడాది విడుదలయ్యే మంచి చిత్రాల్లో ఇది కూడా ఉంటుందని నిర్మాత తెలిపారు.
తాజా వార్తలు
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి







