సలాలా విమానాశ్రయంలో 89% పెరిగిన ప్రయాణికుల సంఖ్య
- April 17, 2022
ఒమన్: 2022 మొదటి త్రైమాసికంలో సలాలా విమానాశ్రయం రికార్డు సృస్టించింది. సుల్తానేట్కు వచ్చే ప్రయాణికుల సంఖ్యలో 89 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సుల్తానేట్ నుండి బయలుదేరే ప్రయాణీకుల సంఖ్య 72 శాతం పెరిగింది. సలాలా ఎయిర్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సలీమ్ అవద్ అల్ యాఫీ మాట్లాడుతూ.. ఒమన్ విమానాశ్రయాలు సంబంధిత విభాగాలు జారీ చేసిన అన్ని ముందుజాగ్రత్త చర్యలను అమలు చేశామన్నారు. సలాలా విమానాశ్రయం ఏప్రిల్ 29న అబుదాబి నుండి విజ్ ఎయిర్ యొక్క మొదటి ప్రత్యక్ష విమానాన్ని( వారానికి 14 విమానాలు) నడుపుతామన్నారు. అలాగే గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ నుండి 2022 జూన్ 28 నుండి సెప్టెంబరు 29 వరకు వారానికి రెండు విమానాలను నడుపుతుందని, అలాగే కువైట్ నుండి వారానికి 5 విమానాలు, జూన్ 2 నుండి ఆగస్టు 30 వరకు సౌదీ అరేబియా నుండి ఫ్లైనాస్ కోసం వారానికి మూడు విమానాలు నడపనున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









