సలాలా విమానాశ్రయంలో 89% పెరిగిన ప్రయాణికుల సంఖ్య
- April 17, 2022
ఒమన్: 2022 మొదటి త్రైమాసికంలో సలాలా విమానాశ్రయం రికార్డు సృస్టించింది. సుల్తానేట్కు వచ్చే ప్రయాణికుల సంఖ్యలో 89 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సుల్తానేట్ నుండి బయలుదేరే ప్రయాణీకుల సంఖ్య 72 శాతం పెరిగింది. సలాలా ఎయిర్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సలీమ్ అవద్ అల్ యాఫీ మాట్లాడుతూ.. ఒమన్ విమానాశ్రయాలు సంబంధిత విభాగాలు జారీ చేసిన అన్ని ముందుజాగ్రత్త చర్యలను అమలు చేశామన్నారు. సలాలా విమానాశ్రయం ఏప్రిల్ 29న అబుదాబి నుండి విజ్ ఎయిర్ యొక్క మొదటి ప్రత్యక్ష విమానాన్ని( వారానికి 14 విమానాలు) నడుపుతామన్నారు. అలాగే గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ నుండి 2022 జూన్ 28 నుండి సెప్టెంబరు 29 వరకు వారానికి రెండు విమానాలను నడుపుతుందని, అలాగే కువైట్ నుండి వారానికి 5 విమానాలు, జూన్ 2 నుండి ఆగస్టు 30 వరకు సౌదీ అరేబియా నుండి ఫ్లైనాస్ కోసం వారానికి మూడు విమానాలు నడపనున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









