సలాలా విమానాశ్రయంలో 89% పెరిగిన ప్రయాణికుల సంఖ్య
- April 17, 2022
ఒమన్: 2022 మొదటి త్రైమాసికంలో సలాలా విమానాశ్రయం రికార్డు సృస్టించింది. సుల్తానేట్కు వచ్చే ప్రయాణికుల సంఖ్యలో 89 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సుల్తానేట్ నుండి బయలుదేరే ప్రయాణీకుల సంఖ్య 72 శాతం పెరిగింది. సలాలా ఎయిర్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సలీమ్ అవద్ అల్ యాఫీ మాట్లాడుతూ.. ఒమన్ విమానాశ్రయాలు సంబంధిత విభాగాలు జారీ చేసిన అన్ని ముందుజాగ్రత్త చర్యలను అమలు చేశామన్నారు. సలాలా విమానాశ్రయం ఏప్రిల్ 29న అబుదాబి నుండి విజ్ ఎయిర్ యొక్క మొదటి ప్రత్యక్ష విమానాన్ని( వారానికి 14 విమానాలు) నడుపుతామన్నారు. అలాగే గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ నుండి 2022 జూన్ 28 నుండి సెప్టెంబరు 29 వరకు వారానికి రెండు విమానాలను నడుపుతుందని, అలాగే కువైట్ నుండి వారానికి 5 విమానాలు, జూన్ 2 నుండి ఆగస్టు 30 వరకు సౌదీ అరేబియా నుండి ఫ్లైనాస్ కోసం వారానికి మూడు విమానాలు నడపనున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







