ఈద్‌కు ముందుగానే జీతాలు చెల్లించాలి: ఒమన్

- April 18, 2022 , by Maagulf
ఈద్‌కు ముందుగానే జీతాలు చెల్లించాలి: ఒమన్

మస్కట్: సుల్తానేట్‌లోని కంపెనీల యజమానులు ఈద్ అల్ ఫితర్ సందర్భంగా కార్మికులకు ఏప్రిల్ నెలలో ముందుగానే జీతాలు చెల్లించాలని ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ (MoL)  కోరింది. ఒమన్‌లోని అన్ని ప్రైవేట్ రంగ సంస్థలు ఏప్రిల్ 21 కంటే ముందే తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని ఆదేశించింది. రాయల్ డిక్రీ నంబర్ 35/2003 ద్వారా ప్రకటించబడిన లేబర్ లా నిబంధనలకు లోబడి ప్రైవేట్ రంగ సంస్థలు ఏప్రిల్ 21 లోపు తమ ఉద్యోగులకు ఏప్రిల్ 2022 నెల జీతాలను పంపిణీ చేయాలని ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com