మే 3-5 నుంచి దోహా కార్నిచ్లో ఈద్ ఫెస్టివల్
- April 18, 2022
దోహా: మే 3-5 నుండి దోహా కార్నిచ్లో మొట్టమొదటి ఈద్ ఫెస్టివల్ను నిర్వహించనున్నట్లు ఖతార్ టూరిజం ప్రకటించింది. కరోనా పరిమితులు ఎత్తివేసిన తర్వాత వస్తున్న ఈద్ను ఘనంగా జరుపేందుకు టూరిజం శాఖ ప్రణాళికతలు రూపొందించింది. వ్యక్తిగత ఈవెంట్లను అనుమతించడంతోపాటు, ఈద్ ఫెస్టివల్లో దేశంలోని మొట్టమొదటిసారిగా భారీ బెలూన్ పరేడ్, మార్చింగ్ బ్యాండ్లు, కార్నివాల్ గేమ్లు, బాణసంచా, ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఖతార్ టూరిజం చైర్మన్, ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, హెచ్ఇ అక్బర్ అల్ బేకర్ తెలిపారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022కి ఆతిథ్యం ఇవ్వడానికి అన్ని టూరిజం శాఖ అద్భుత ఏర్పాట్లు చేస్తుందన్నారు. అలాగే ఖతార్ టూరిజం ఏడాది పొడవునా దేశీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ సందర్శకులను ఆకర్షించే ఉత్పత్తులు, సేవలు, ఈవెంట్లను ప్రైవేట్ రంగాల భాగస్వాములతో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి
- తెలంగాణలో జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగింపు
- ఇక ఇంటర్నెట్ లేకుండానే UPI లావాదేవీలు









