మరికొన్ని జట్లకు అవకాశం కల్పించే దిశగా ఐసీసీ సన్నాహాలు
- April 04, 2016
ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ప్రపంచకప్లో మరికొన్ని జట్లకు అవకాశం కల్పించే దిశగా అంతర్జాతీయ క్రికెట్ బోర్డు (ఐసీసీ) సన్నాహాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం 12 జట్లతో ట్వంటీ-20 ప్రపంచకప్ పోటీలు నిర్వహిస్తోన్న ఐసీసీ, అర్హత పోటీలు పెంచింది. ఇంకా మరికొన్ని జట్లకు కూడా అవకాశం కల్పించేందుకు ఐసీసీ సుముఖత వ్యక్తం చేస్తోంది. ఫలితంగా 2012వ సంవత్సరం శ్రీలంకలో జరగనున్న ఐసీసీ ట్వంటీ-20 వరల్డ్కప్లో మరిన్ని జట్లు రంగంలోకి దిగుతాయని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రపంచకప్ అర్హతపోటీల్లో ఆరు లేదా ఎనిమిది జట్లు పాల్గొనేవి. కానీ శ్రీలంకలో జరుగనున్న ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ప్రపంచకప్-2012 మరిన్ని జట్లకు అవకాశం కల్పించనున్నామని ఐసీసీ తెలిపింది. దీనికోసం 16 జట్లతో అర్హత టోర్నమెంట్ను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఐసీసీ కమిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







