మరికొన్ని జట్లకు అవకాశం కల్పించే దిశగా ఐసీసీ సన్నాహాలు

- April 04, 2016 , by Maagulf
మరికొన్ని జట్లకు అవకాశం కల్పించే దిశగా ఐసీసీ సన్నాహాలు

ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ప్రపంచకప్‌లో మరికొన్ని జట్లకు అవకాశం కల్పించే దిశగా అంతర్జాతీయ క్రికెట్ బోర్డు (ఐసీసీ) సన్నాహాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం 12 జట్లతో ట్వంటీ-20 ప్రపంచకప్ పోటీలు నిర్వహిస్తోన్న ఐసీసీ, అర్హత పోటీలు పెంచింది. ఇంకా మరికొన్ని జట్లకు కూడా అవకాశం కల్పించేందుకు ఐసీసీ సుముఖత వ్యక్తం చేస్తోంది. ఫలితంగా 2012వ సంవత్సరం శ్రీలంకలో జరగనున్న ఐసీసీ ట్వంటీ-20 వరల్డ్‌కప్‌లో మరిన్ని జట్లు రంగంలోకి దిగుతాయని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రపంచకప్‌ అర్హతపోటీల్లో ఆరు లేదా ఎనిమిది జట్లు పాల్గొనేవి. కానీ శ్రీలంకలో జరుగనున్న ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ప్రపంచకప్-2012 మరిన్ని జట్లకు అవకాశం కల్పించనున్నామని ఐసీసీ తెలిపింది. దీనికోసం 16 జట్లతో అర్హత టోర్నమెంట్‌ను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఐసీసీ కమిటీ వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com