రిజర్వ్ చేసిన ప్రదేశాల్లో పార్కింగ్ చేస్తే Dh1,000 జరిమానా
- April 26, 2022
యూఏఈ: అధికారులు, ప్రత్యేక అవసరాలు ఉన్నవారి కోసం కేటాయించిన ప్రదేశాలలో పార్కింగ్ చేస్తే వాహనదారులకు 1,000 దిర్హామ్లు జరిమానా, 6 బ్లాక్ పాయింట్లతో జరిమానా విధించబడుతుందని అజ్మాన్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టును షేర్ చేశారు. అధికారులు, ప్రత్యేక అవసరాలు ఉన్నవారిని గౌరవించాలని నివాసితులకు అందులో గుర్తు చేశారు. రమదాన్ పవిత్ర మాసాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలను జాగ్రత్తగా పాటించాలని వాహనదారులను హెచ్చరించారు. ముఖ్యంగా ఇఫ్తార్ సమయం దగ్గర పడుతున్న సమయంలో వాహనదారులు అతివేగాన్ని నివారించాలని, రోడ్లపై సురక్షితమైన దూరాన్ని పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







