దుబాయ్: సెలవుల కోసం యజమానిని చంపేసిన ప్రవాసుడు..
- April 26, 2022
దుబాయ్:దుబాయ్ లో సెలవుల కోసం యజమానిని చంపేసిన ప్రవాస కార్మికుడికి దుబాయ్ కోర్టు జీవితఖైదు విధించింది.వివరాల్లోకి వెళ్తే.. వాహనాల మరమ్మత్తులకు సంబంధించిన గ్యారేజ్లో ఆసియా(తూర్పు ఐరోపా)కు చెందిన ఓ వ్యక్తి పని చేసేవాడు.ఈ క్రమంలో ఒకరోజు తాను స్వదేశానికి వెళ్లాలనుకుంటున్నానని, తనకు సెలవు కావాలని యజమానితో అన్నాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో కార్మికుడు గ్యారేజ్లోనే యజమానిని కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత యజమాని మిత్రులు కొందరు గ్యారేజ్కు వచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న స్నేహితుడిని చూసి పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహంపై ఉన్న గాయాలను చూసి అది కచ్చితంగా హత్యేననే నిర్ణయానికి వచ్చారు.
అప్పటికే గ్యారేజ్లో పనిచేసే కార్మికుడు కనిపించకపోవడంతో పోలీసుల అనుమానం మరింత పెరిగింది. వెంటనే అతడికి కోసం వెతికారు.అప్పటికే అతడు దేశం విడిచిపెట్టి వెళ్లిపోయే ఏర్పాట్లలో ఉన్నాడు. ప్రయాణ పత్రాల కోసం అతడి దేశానికి చెందిన కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లాడు.అప్పటికే తనిఖీలు ముమ్మరం చేసిన దుబాయ్ పోలీసులు అనుమానంతో కాన్సులేట్ కార్యాలయం వద్దకు వెళ్లారు.వారి అనుమానం నిజమైంది.అతడు అక్కడే ఉన్నాడు.దాంతో వెంటనే అరెస్ట్ చేశారు.అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నిజాన్ని అంగీకరించాడు. సెలవుల విషయమై యజమానితో జరిగిన గొడవలో తానే అతడిని చంపేసినట్లు ఒప్పుకున్నాడు. 2020 జూన్లో ఈ ఘటన జరిగింది.తాజాగా ఈ కేసు దుబాయ్ క్రిమినల్ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో తన నేరాన్ని అంగీకరించిన కార్మికుడికి న్యాయస్థానం జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన







