సౌదీ లో తెలంగాణ వాసి మృతి...GWAC ఆపన్నహస్తం!
- April 29, 2022తెలంగాణ/సౌదీ: తెలంగాణ లోని మంచిర్యాల జిల్లా, మురిమడుగు గ్రామానికి చెందిన దుబ్బ రాజం కుటుంబ పోషణ కోసం,ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియా వెళ్ళడం జరిగింది.విధి నిర్వహణలో సమయంలో ప్రమాదవశాత్తు రోడ్ యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది.తెలంగాణ గల్ఫ్ కార్మికుడి మరణ వార్త తెలియగానే GWAC సౌదీ శాఖ ఉపాధ్యక్షులు చిన్నయ్య విషయం తెలుసుకొని రఫీక్ కు తెలిపిన వెంటనే ఇండియన్ ఎంబసీ కి తెలియజేయడం జరిగింది.GWAC జెద్దా ఇంచార్జ్ జాడి మల్లేశం మరియు రాజ్ కుమార్, ఆనంద్, సతీష్ ,కృష్ణ అందరూ కలిసి దుబ్బ రాజు పనిచేసే క్యాంపుకు వెళ్లి మాట్లాడటం జరిగింది. జాడీ మల్లేశం మృతదేహాన్ని స్వస్థలానికి పంపించేందుకు గాను కావలసిన పత్రాలు/క్లియరెన్స్ లను హాస్పిటల్, పోలీస్ స్టేషన్, ఎంబిసి వద్ద నుండి సేకరించడటం జరిగింది.ఇండియన్ ఎంబసీ సహాయం, సౌదీలోని GWAC సంస్థ సభ్యుల సహకారం మరియు దుబ్బ రాజు వాళ్ళ కంపెనీ లో పని చేసే వారి సహకారం కూడా ఈ కార్యక్రమానికి దోహదపడ్డాయి.
హైదరాబాద్ విమానాశ్రయం నుండి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఉచిత అంబులెన్స్ సర్వీస్ బడుగు లక్ష్మణ్, NRI డిపార్ట్మెంట్ చిట్టిబాబు ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రస్తుతం సౌదీ అరేబియా లోనే తెలంగాణ గల్ఫ్ కార్మికుల మృతదేహాలు 3 ఉన్నాయి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ లో చనిపోయిన మృతదేహాలను త్వరగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి.గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన మాట తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి,500 కోట్ల నిధులతో NRI పాలసీ అమలు చేసి గల్ఫ్ చనిపోయిన మృతుల కుటుంబాలకు 5లక్షల రూపాయలు ఎక్గ్రేషియా తక్షణమే ప్రకటించాలి అంటూ గల్ఫ్ లో నివసిస్తున్న కార్మికులు డిమాండ్ చేయటం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు