తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం
- April 29, 2022
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో ఇవాళ ఓ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. శ్రీలంకకు మానవతా సహాయం పంపేందుకు రాష్ట్రాన్ని అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ.. తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు.. రాష్ట్ర డీఎంకే ప్రభుత్వం గతంలో శ్రీలంక తమిళులకు మాత్రమే కీలకమైన సామాగ్రిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది.
కాగా స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ, ద్వీప దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని అనుభవిస్తోందని, ప్రజలకు అందుబాటులో లేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని అన్నారు. శ్రీలంక పరిస్థితిని మరొక దేశానికి సంబంధించిన అంశంగా చూడలేమని, “మేము సహాయం అందించాలి” అని స్టాలిన్ తెలిపారు. శ్రీలంక తమిళులకు అవసరమైన సామాగ్రిని అందించాలనే తన మునుపటి నిర్ణయాన్ని స్టాలిన్ ప్రస్తావించారు.40,000 టన్నుల ధాన్యం (రూ. 80 కోట్లు), మందులు (రూ. 28 కోట్లు), 500 టన్నుల పాలపొడి (విలువ రూ. 15 కోట్లు) శ్రీలంకకు రవాణా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని స్టాలిన్ తెలిపారు.కాగా రాష్ట్రం నేరుగా శ్రీలంకకు వస్తువులను బదిలీ చేయలేనందున, వాటిని రాష్ట్ర ప్రభుత్వం ..ద్వీప దేశంలోని భారత హైకమిషన్ ద్వారా పంపాలని స్టాలిన్ అన్నారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..







