షూటింగ్లో హీరో గోపీచంద్కి ప్రమాదం..
- April 29, 2022మైసూరు: హీరో గోపీచంద్ ఇటీవలే సీటిమార్ సినిమాతో చాలా రోజుల తర్వాత సక్సెస్ అందుకున్నాడు. గోపీచంద్ త్వరలో పక్కా కమర్షియల్ సినిమాతో రానున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ తన 30వ సినిమా షూటింగ్ లో ఉన్నాడు.గోపీచంద్ కి లక్ష్యం, లౌక్యం లాంటి రెండు హిట్స్ అందించిన డైరెక్టర్ శ్రీవాస్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. శ్రీవాస్-గోపీచంద్ కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా ఇది రానుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూరులో జరుగుతుంది.అయితే షూటింగ్ జరుగుతుండగా స్పాట్ లో హీరో గోపీచంద్ కాలు జారి కింద పడ్డారు.వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా కేవలం బెణికింది, ఎలాంటి ప్రమాదం లేదు, కొంచెం రెస్ట్ తీసుకుంటే చాలు అని చెప్పినట్టు సమాచారం.ఈ ఘటనపై దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ.. గోపీచంద్ షూటింగ్ సమయంలో కాలు జారి కింద పడ్డారు. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని తెలిపారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్