నిరుపేదలకు నిత్యావసర కిట్లు పంపిణీ చేసిన మైనారిటీ శాఖ, సెర్ప్ కమీషనర్ ఇంతియాజ్
- April 30, 2022
విజయవాడ: నగరంలోని నిరుపేదల సుమారు 100 మందికి నిత్యావసర కిట్లను మైనార్టీ శాఖ, సెర్ప్ కమిషనర్ AMD.ఇంతియాజ్ పంపిణీ చేసారు. శనివారం లబ్బీపేటలోని దర్శాగా ఏ ఇస్లామిక్ స్కూల్ పరిసరాల్లో ఉన్న పేదలకు కీట్లు పంపిణీ చేసి తన ఉదారత చాటుకున్నారు. సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్, తాసిల్దార్ శ్రీనివాస్, మునీర్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మునీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 75 వేల రూపాయలతో కొనుగోలు చేసిన నిత్యావసర సరుకులు కిట్లను పంపిణీ చేశారు. కిట్లలో రెండు కేజీలు గోధుమపిండి ,ఒక కేజీ పంచదార, మరో కేజీ సేమియా, ఐదు కేజీల సోనామసూరి బియ్యం, డ్రై ఫ్రూట్స్ వున్నాయి.
నిరుపేదలు సంతోషంగా రంజాన్ పండుగ నిర్వహించుకునేందుకు ఈ నిత్యావసర కిట్టు ఉపయోగపడుతుంది. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నవారంతా నిరుపేదల పట్ల కూడా ఆలోచించాలని పవిత్ర గ్రంధం ఖురాన్ బోధిస్తుంది.ఆ సూక్తిని ప్రేరణగా తీసుకున్న ఇంతియాజ్ పేదలపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. నిత్యవసర కిట్లను ఆయన గత రంజాన్ మాసంలో కూడా పంపిణీ చేసారు. అదే పరంపరను కొనసాగిస్తూ ప్రస్తుత రంజాన్ లో కూడా కిట్లను పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







