షార్జా: సముద్రంలో మునిగి భారతీయ వ్యక్తి మృతి!

- May 05, 2022 , by Maagulf
షార్జా: సముద్రంలో మునిగి భారతీయ వ్యక్తి మృతి!

షార్జా: షార్జాలో రంజాన్ పండుగ పూట ఓ భారతీయ కుటుంబంలో విషాదం అలుముకుంది.అక్కడి హమ్రియా సముద్రంలో సరదాగా ఈతకు వెళ్లిన 24 ఏళ్ల భారత యువకుడు నీట మునిగి చనిపోయాడు.మృతుడిని కేరళ రాష్ట్రం త్రిస్సూర్ జిల్లాలోని గురువాయూర్‌కు చెందిన ముహమ్మద్ ఎమిల్‌గా గుర్తించారు.అతడు ఫుజైరాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు.ఈద్ వేడుకల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి సముద్ర తీరానికి వెళ్లిన ఎమిల్.. సరదాగా ఈత కొడుతున్న సమయంలో లోపలికి కొట్టుకుపోయాడు. కొద్దిసేపటి తర్వాత అతడి మృతదేహం ఒడ్డుకు కొట్టుకువచ్చింది.స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న షార్జా పోలీసులు ఎమిల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం మృతదేహాన్ని మార్చురీలో ఉంచామని, లాంఛనాలు పూర్తయిన తర్వాత స్వగ్రామానికి తీసుకువస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com