గ్యాస్ పంప్ మీటర్ రీడింగ్ లో ట్యాంపరింగ్...కార్మికులు అరెస్ట్
- May 06, 2022
జెడ్డా: గ్యాస్ పంప్ మీటర్ రీడింగ్లను ట్యాంపరింగ్ చేస్తున్న పలువురు ప్రవాస కార్మికులను అధికారులు అరెస్ట్ చేశారు. వారిపై దేశ బహిష్కరణ వేటు వేయాలని భద్రతా అధికారులకు రిఫర్ చేశారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఇంధన మంత్రిత్వ శాఖ, సౌదీ స్టాండర్డ్స్, మెట్రాలజీ మరియు క్వాలిటీ ఆర్గనైజేషన్ (SASO) సంయుక్తంగా అనేక గ్యాస్ స్టేషన్లను తనిఖీ చేసింది. ఈ సందర్భంగా ఓ గ్యాస్ స్టేషన్లో చట్టవిరుద్ధమైన పద్ధతులను అనుసరించినట్లు గుర్తించారు. కొంతమంది కార్మికులు గ్యాస్ పంప్ మీటర్ రీడింగ్లతో టింకరింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వీడియోల వైరల్ కావడంతో అధికార యంత్రాంగం తనిఖీలు చేపట్టింది. వాణిజ్యం, ఇంధన మంత్రిత్వ శాఖలు, SASO సహకారంతో తూర్పు ప్రావిన్స్, జెడ్డా గవర్నరేట్లోని నిర్దిష్ట గ్యాస్ స్టేషన్లలో తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







