ఖైదీల విడుదలకు 100,000 దిర్హాములు ఇచ్చేందుకు ఎమిరాతి వ్యాపారవేత్త హామీ

- May 06, 2022 , by Maagulf
ఖైదీల విడుదలకు 100,000 దిర్హాములు ఇచ్చేందుకు ఎమిరాతి వ్యాపారవేత్త హామీ

దుబాయ్: ఎమిరాతి వ్యాపారవేత్త యాకూబ్ అల్ అలి, అప్పులు చెల్లించలేక జైళ్ళలో మగ్గుతున్న ఖైదీల విడుదల కోసం తనవంతుగా 100,000 దిర్హాములు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. మేజర్ జనరల్ డాక్టర్ మొహమ్మద్ అల్ ముర్ (డైరెక్టర్ ఆఫ్ ది జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ - దుబాయ్ పోలీస్) మాట్లాడుతూ, యాకూబ్ అల్ అలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. యూఏఈలో మెరుగైన పోలీసింగ్ అందించడమే కాకుండా, ఆపదలో వున్నవారిని ఆదుకునేందుకు పోలీస్ విభాగం ప్రత్యేక చర్యలు చేపడుతోందనీ, అదే సమయంలో సాయం చేయడానికి ముందుకొచ్చేవారి ద్వారా సాయం పొందగోరువారికి సాయం అందించగలుగుతున్నామని మేజర్ జనరల్ అల్ ముర్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com