ప్రవాసులకు శుభవార్త చెప్పిన కువైట్
- May 08, 2022
కువైట్ సిటీ: ఫ్యామిలీ విజిట్ వీసా ల విషయంలో ప్రవాసులకు కువైట్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.కరోనా కారణంగా రెండేళ్ల పాటు నిలిచిపోయిన ఫ్యామిలీ విజిట్ వీసాల జారీని నేటి నుంచి తిరిగి ప్రారంభించింది.ఈద్ కు ముందు ఆ దేశ మంత్రి మండలి కరోనాకు సంబంధించిన ఆంక్షలన్నింటినీ ఎత్తివేయడంతో ప్రవాసుల నుంచి ఫ్యామిలీ విజిట్ వీసాల దరఖాస్తులకు మార్గం సుగమైంది.ఈ నేపథ్యంలోనే గత నెలలో రెసిడెన్స్ అఫైర్స్ డిపార్ట్మెంట్ నేటి నుంచి ఈ వీసాలు జారీ చేయనున్నట్లు ప్రకటించింది.అన్నట్టుగానే ఇవాళ్టి నుంచి వీసాల జారీ ప్రారంభించింది.ఇక ఈ వీసాల కోసం ప్రవాసులు దరఖాస్తు చేసుకునేందుకు ఇంతకుముందు ఉన్న షరతులే వర్తించనున్నాయి.జాతీయత, వేతన పరిమితి, సెక్యురిటీ చెక్స్ తదితర విషయాల్లో పాత నియమాలే వర్తిస్తాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
ఫ్యామిలీ వీసాకు ల వివరాలు..ప్రవాసుడి భార్య, 16 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే ఫ్యామిలీ విజిట్ వీసా లు జారీ చేస్తారు.వర్క్ పర్మిట్లో 500KDలు ఉన్నవారికి ఫ్యామిలీ వీసా మంజూరు చేయడం జరుగుతుంది.ఇకపోతే కమర్షియల్ విజిట్ వీసాలు, గవర్నమెంట్ విజిట్ మరియు ఈ-వీసాలు ప్రస్తుతం 53 దేశాల వారికి జారీ చేస్తున్నారు.ఎలక్ట్రానిక్ సర్వీస్ పోర్టల్ ద్వారా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ ఎంట్రీ వీసాలు, వర్క్ పర్మిట్లను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!







