మహిళలతో బలవంతంగా వ్యభిచారం. నిందితుల జైలు శిక్షను సమర్థించిన కోర్టు
- May 09, 2022
బహ్రెయిన్: మానవ అక్రమ రవాణా కేసులో తమకు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను సవాలు చేసిన ఇద్దరు వ్యక్తుల జైలు శిక్షలను హైకోర్టు అప్పీలు కోర్టు సమర్థించింది. ఇద్దరు బాలికలను అక్రమ రవాణా చేసి, నకిలీ ఉద్యోగ ఆఫర్లతో ప్రలోభపెట్టి వారిని వ్యభిచారంలోకి దింపినందుకు సదరు వ్యక్తులను కోర్టు దోషులుగా తేల్చింది. జైలు శిక్ష పూర్తయిన తర్వాత వారిని దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఆసియాకు చెందిన ఓ మహిళ తమ సొంతూరుకు చెందిన ఇద్దరు అమ్మాయిలను వెయిట్రెస్ లుగా పని చేసేందుకు బహ్రెయిన్ రప్పించింది. అనంతరం వారి పాస్ పోర్టులను స్వాధీనం చేసుకొని వారిని ఓ అపార్టుమెంట్ లో బంధించింది. తాను చెప్పినట్లు వ్యభిచారం చేయకపోతే సొంతూర్లో పరువు తీస్తానని చెప్పి బాధితులను బెదిరించి వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపింది. శిక్ష పడ్డ మరో వ్యక్తి కస్టమర్లను తీసుకొచ్చేవాడు. పోలీసులకు ఫోన్ చేసే అవకాశం దొరికే వరకు బాధితుల కష్టాలు కొనసాగాయి. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితులపై మానవ అక్రమ రవాణా, బాధితులను వ్యభిచారంలోకి నెట్టడం, వ్యభిచార గృహాన్ని స్థాపించడం, నిర్వహించడం వంటి అభియోగాలు మోపింది.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









