ఖతార్-భారత్ మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు: భారత విదేశాంగ శాఖ
- May 09, 2022
ఖతార్: భారతదేశం, ఖతార్ మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయని, అవి అద్భుతమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వి మురళీధరన్ తెలిపారు. ఆదివారం దోహాలోని ఇండియన్ కల్చరల్ సెంటర్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత రెండేళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఐదు రెట్లు పెరిగిందని, అయితే దీన్ని మరిన్ని రంగాలకు విస్తరించాల్సి ఉందన్నారు. రెండు దేశాల మధ్య విస్తృతమైన అనుబంధం ఉందని, వివిధ రంగాల్లో తమ ప్రాతినిధ్యాన్ని చాటుకుంటూ భారతీయ ప్రవాసులు ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని మంత్రి ఆకాంక్షించారు. అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాలలో ద్వైపాక్షిక సహకారం పెరుగుతోందని, అయితే మరింత అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఖతార్ ఆహార భద్రతా కార్యక్రమాలలో భారతదేశం, భారతదేశ ఇంధన భద్రతలో ఖతార్ పాల్గొంటున్నాయని ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నందుకు భారతీయ ప్రవాసులకు అభినందనలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఖతార్ లోని భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్, భారత విదేశాంగ శాఖ జాయింట్ సెక్రెటరీ విపుల్ లతోపాటు పలువురు భారత, ఖతార్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







