నకిలీ విశ్వవిద్యాలయం కుంభకోణం : అమెరికా
- April 06, 2016అమెరికాలో తాజాగా వెలుగులోకి వచ్చిన నకిలీ విశ్వవిద్యాలయం కుంభకోణంలో 10 మంది ప్రవాస భారతీయులు నిందితులుగా ఉన్నట్లు తెలిసింది. వీరిలో ముగ్గురు తెలుగువారు ఉండటం గమనార్హం. వారిని తేజేష్ కొడాలి, కార్తీక్ నిమ్మల, గోవర్ధన్ దేవరశెట్టిగా గుర్తించారు.అసలేం జరిగిందంటే... ఉత్తర న్యూజెర్సీ యూనివర్శిటీ భోగస్దని... దానిలో ఎలాంటి తరగతులు జరగడం లేదని వెలుగులోకి వచ్చింది. అయితే దీని పేరుతో వెయ్యి మందికి పైగా విదేశీయులు వీసాలు పొంది అమెరికాకు వచ్చినట్లు తేలింది.ముఖ్యంగా భారత్, చైనాల నుంచే వీరు వలసేతర విద్యార్థి వీసాలతో వచ్చినట్లు బయటపడింది. ఈ కుంభకోణానికి సంబంధించి 21 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. వీరిలో ఏకంగా పది మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. నిందితుల్లో ఎక్కువ మంది న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియాల్లో ఉంటున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు