నకిలీ విశ్వవిద్యాలయం కుంభకోణం : అమెరికా
- April 06, 2016
అమెరికాలో తాజాగా వెలుగులోకి వచ్చిన నకిలీ విశ్వవిద్యాలయం కుంభకోణంలో 10 మంది ప్రవాస భారతీయులు నిందితులుగా ఉన్నట్లు తెలిసింది. వీరిలో ముగ్గురు తెలుగువారు ఉండటం గమనార్హం. వారిని తేజేష్ కొడాలి, కార్తీక్ నిమ్మల, గోవర్ధన్ దేవరశెట్టిగా గుర్తించారు.అసలేం జరిగిందంటే... ఉత్తర న్యూజెర్సీ యూనివర్శిటీ భోగస్దని... దానిలో ఎలాంటి తరగతులు జరగడం లేదని వెలుగులోకి వచ్చింది. అయితే దీని పేరుతో వెయ్యి మందికి పైగా విదేశీయులు వీసాలు పొంది అమెరికాకు వచ్చినట్లు తేలింది.ముఖ్యంగా భారత్, చైనాల నుంచే వీరు వలసేతర విద్యార్థి వీసాలతో వచ్చినట్లు బయటపడింది. ఈ కుంభకోణానికి సంబంధించి 21 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. వీరిలో ఏకంగా పది మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. నిందితుల్లో ఎక్కువ మంది న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియాల్లో ఉంటున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









