నకిలీ విశ్వవిద్యాలయం కుంభకోణం : అమెరికా

- April 06, 2016 , by Maagulf
నకిలీ విశ్వవిద్యాలయం కుంభకోణం :  అమెరికా

అమెరికాలో తాజాగా వెలుగులోకి వచ్చిన నకిలీ విశ్వవిద్యాలయం కుంభకోణంలో 10 మంది ప్రవాస భారతీయులు నిందితులుగా ఉన్నట్లు తెలిసింది. వీరిలో ముగ్గురు తెలుగువారు ఉండటం గమనార్హం. వారిని తేజేష్‌ కొడాలి, కార్తీక్‌ నిమ్మల, గోవర్ధన్‌ దేవరశెట్టిగా గుర్తించారు.అసలేం జరిగిందంటే... ఉత్తర న్యూజెర్సీ యూనివర్శిటీ భోగస్‌దని... దానిలో ఎలాంటి తరగతులు జరగడం లేదని వెలుగులోకి వచ్చింది. అయితే దీని పేరుతో వెయ్యి మందికి పైగా విదేశీయులు వీసాలు పొంది అమెరికాకు వచ్చినట్లు తేలింది.ముఖ్యంగా భారత్‌, చైనాల నుంచే వీరు వలసేతర విద్యార్థి వీసాలతో వచ్చినట్లు బయటపడింది. ఈ కుంభకోణానికి సంబంధించి 21 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. వీరిలో ఏకంగా పది మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. నిందితుల్లో ఎక్కువ మంది న్యూయార్క్‌, న్యూజెర్సీ, కాలిఫోర్నియాల్లో ఉంటున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com