'మేకిన్ ఇండియా'తో పేదలకు ఒరిగేదేం లేదు: రాహుల్ గాంధీ
- April 06, 2016బంగారు ఆభరణాలపై ఎక్సైజ్ డ్యూటీ విధించడాన్ని వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం బంగారు వర్తకుల పాలిట ఆత్మహత్యాసదృశ్యంగా ఆయన వర్ణించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బంగారు వ్యాపారులు చేస్తున్న ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు. బీజేపీలోని కొంత మంది నాయకులు బంగారు ఆభరణాలపై ఎక్సైజ్ డ్యూటీని వ్యతిరేకిస్తున్నారని, బహిరంగంగా చెప్పడానికి వారు జంకుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు.'మేకిన్ ఇండియా'లోగోలో సింహం బొమ్మ పెట్టడంతో తాను ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పారు. పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లను మేలు చేసేందుకే 'మేకిన్ ఇండియా'ను ముందుకు తీసుకొచ్చారని తర్వాత తనకు అర్థమైందన్నారు.మేకిన్ ఇండియా'తో పేదలకు ఒరిగేదేం లేదని అన్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్