ఏటీఎమ్ 2022 ఎగ్జిబిషన్‌లో అత్యుత్తమంగా నిలిచిన బహ్రెయిన్

- May 13, 2022 , by Maagulf
ఏటీఎమ్ 2022 ఎగ్జిబిషన్‌లో అత్యుత్తమంగా నిలిచిన బహ్రెయిన్

బహ్రెయిన్: దుబాయ్‌లోని అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 2022 ఎగ్జిబిషన్‌లో ఈ సంవత్సరం బహ్రెయిన్ అత్యత్తమంగా నిలిచింది. ఈ మేరకు బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్ అథారిటీ (BTEA) ప్రకటించింది. బహ్రెయిన్ నేషనల్ పెవిలియన్ ద్వారా గురువారంతో ముగిసిన ఈ అంతర్జాతీయ టూరిజం ఈవెంట్‌లో పాల్గొన్న 158 పెవిలియన్‌లలో బహ్రెయిన్ పెవిలియన్‌ అతిపెద్దది. పెవిలియన్‌లో నేషనల్ ఎయిర్ క్యారియర్ గల్ఫ్ ఎయిర్ నేతృత్వంలో 21 ఎగ్జిబిటర్‌లు పాల్గొన్నాయి. అలాగే హోటళ్లు, రిసార్ట్ లు, టూరిజం కంపెనీలు, టూర్ ఆపరేటర్‌లతో సహా అనేక ప్రసిద్ధ బహ్రెయిన్ పర్యాటక సౌకర్యాలను కల్పించారు. బహ్రెయిన్ పర్యాటక రంగాన్ని ప్రపంచం దృష్టికి తీసుకురావడానికి, నాగరికత, వైవిధ్యం, వారసత్వం, ఆధునికతను తెలియజేసేలా అనేక ప్రదర్శనలను బహ్రెయిన్ పెవిలియన్ లో ఏర్పాటు చేశారు. 

 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com