ఫేక్ సోషల్ మీడియా పోస్టులపై ‘దేవా’ హెచ్చరిక

- May 20, 2022 , by Maagulf
ఫేక్ సోషల్ మీడియా పోస్టులపై ‘దేవా’ హెచ్చరిక

దుబాయ్: సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న కొన్ని పోస్టులు, సందేశాలు మోసపూరితమైనవని దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (దేవా-DEWA) స్పష్టం చేసింది. వాట్సాప్ (WhatsApp) గ్రూపులలో విస్తృతంగా షేర్ అవుతున్న ఒక నకిలీ సోషల్ మీడియా పోస్టుపై హెచ్చరించింది. ఆ ఫేక్ పోస్టులో కొన్ని ప్రశ్నలకు సమాధానమివ్వమని ప్రజలను అడుగుతున్నారని, గెలిచిన వారికి Dh10,000 వరకు నగదు బహుమతి కూడా అందిస్తామని అందులో పేర్కొన్నారని వాటర్ అథారిటీ తెలిపింది. ఇలాంటివన్ని ఫేక్ సందేశాలని, నగదు బహుమతి అంటూ వచ్చే సోషల్ మీడియా పోస్టులసు నమ్మి మోసపోవద్దని ప్రజలను ‘దేవా’ కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com