ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.36,663 కోట్ల మేర ట్యాక్స్ వసూలు

- April 07, 2016 , by Maagulf
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.36,663 కోట్ల మేర ట్యాక్స్ వసూలు

 ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.36,663 కోట్ల మేర ట్యాక్స్ వసూలు అయినట్లు ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్‌బాబు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 15.4 శాతం పెరిగిందన్నారు. తమిళనాడు తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక ఐటీ వసూళ్లు జరిగినట్లు ఆయన చెప్పారు. ఈ ఏడాది రూ.4,83,398 మంది మొదటి సారి ట్యాక్స్ కట్టారన్నారు. రూ.2 కోట్ల మేర వార్షిక ఆదాయం ఉన్నవారు ఆడిటింగ్ పుస్తకాలు లేకుండా ఈ-ఫైలింగ్ చేయవచ్చని పేర్కొన్నారు. 36 డీఫాల్ట్ కేసులు నమోదు అయ్యాయని వారిలో నలుగురిని జైలుకు పంపినట్లు సురేష్‌బాబు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com