వాక్-ఇన్ పాస్పోర్ట్ సేవా శిబిరాలను ఏర్పాటు చేయనున్న దుబాయ్ ఇండియన్ కాన్సులేట్
- May 21, 2022
దుబాయ్: మే 22 నుండి వరుసగా రెండు ఆదివారాల్లో వాక్-ఇన్ పాస్పోర్ట్ సేవా శిబిరాలను దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. మే 29న రెండవ శిబిరం నిర్వహించబడుతుంది. దుబాయ్, షార్జాలోని నాలుగు బీఎల్ఎస్ (BLS) ఇంటర్నేషనల్ సర్వీస్ లిమిటెడ్ సెంటర్లలో ఈ ప్రత్యేక కార్యక్రమం జరుగనుంది. భారతీయ ప్రవాసుల నుండి అత్యవసర పాస్పోర్ట్ సంబంధిత సేవలను అందించడానికి పాస్పోర్ట్ సేవా శిబిరాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుదారులు ఆన్లైన్ లో పూర్తి చేసిన దరఖాస్తును నాలుగు సెంటర్ల వద్ద సమర్పించవచ్చని ఇండియన్ కాన్సులేట్ ట్వీట్ చేసింది. అత్యవసర కేసుల్లో వైద్య చికిత్స, మరణం, పాస్పోర్ట్ ల గడువు ముగియడం(జూన్ 30 నాటికి), అత్యవసర పాస్పోర్ట్ పునరుద్ధరణ, వీసాలు రీ-స్టాంప్ చేయడం, గడువు ముగిసిన లేదా రద్దు చేయబడిన వీసాలు లేదా కొత్త ఉద్యోగం కోసం వీసా పొందడం వంటివి ఉన్నాయి.ఇతర కేటగిరీలు - NRI సర్టిఫికేట్లు (విద్యాపరమైన ప్రయోజనాల కోసం), పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్లు (ఉద్యోగం లేదా ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసం), భారతదేశంలో ప్రవేశం కోసం లేదా విదేశాల్లో విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు పాస్పోర్ట్ పునరుద్ధరణ వంటి సర్వీసులను అందించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







