వాక్-ఇన్ పాస్పోర్ట్ సేవా శిబిరాలను ఏర్పాటు చేయనున్న దుబాయ్ ఇండియన్ కాన్సులేట్
- May 21, 2022దుబాయ్: మే 22 నుండి వరుసగా రెండు ఆదివారాల్లో వాక్-ఇన్ పాస్పోర్ట్ సేవా శిబిరాలను దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. మే 29న రెండవ శిబిరం నిర్వహించబడుతుంది. దుబాయ్, షార్జాలోని నాలుగు బీఎల్ఎస్ (BLS) ఇంటర్నేషనల్ సర్వీస్ లిమిటెడ్ సెంటర్లలో ఈ ప్రత్యేక కార్యక్రమం జరుగనుంది. భారతీయ ప్రవాసుల నుండి అత్యవసర పాస్పోర్ట్ సంబంధిత సేవలను అందించడానికి పాస్పోర్ట్ సేవా శిబిరాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుదారులు ఆన్లైన్ లో పూర్తి చేసిన దరఖాస్తును నాలుగు సెంటర్ల వద్ద సమర్పించవచ్చని ఇండియన్ కాన్సులేట్ ట్వీట్ చేసింది. అత్యవసర కేసుల్లో వైద్య చికిత్స, మరణం, పాస్పోర్ట్ ల గడువు ముగియడం(జూన్ 30 నాటికి), అత్యవసర పాస్పోర్ట్ పునరుద్ధరణ, వీసాలు రీ-స్టాంప్ చేయడం, గడువు ముగిసిన లేదా రద్దు చేయబడిన వీసాలు లేదా కొత్త ఉద్యోగం కోసం వీసా పొందడం వంటివి ఉన్నాయి.ఇతర కేటగిరీలు - NRI సర్టిఫికేట్లు (విద్యాపరమైన ప్రయోజనాల కోసం), పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్లు (ఉద్యోగం లేదా ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసం), భారతదేశంలో ప్రవేశం కోసం లేదా విదేశాల్లో విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు పాస్పోర్ట్ పునరుద్ధరణ వంటి సర్వీసులను అందించనున్నారు.
తాజా వార్తలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే