యూఏఈలో మూడు కొత్త మంకీపాక్స్ కేసులు
- May 30, 2022
అబుధాబి: యూఏఈలో మూడు కొత్త మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ (MoHaP) ప్రకటించింది. కోవిడ్-19తో పోల్చితే మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి. సాధారణంగా ఇది ఒకరి నుంచి మరోకరికి అంత సులువుగా వ్యాప్తి చెందదు. వ్యాధి సోకిన వ్యక్తి వాడిన వస్తువులు, దుస్తులు, సన్నిహిత సంబంధం ద్వారా ఇది ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ కడుపులోని బిడ్డకు కూడా సోకుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రయాణాలు, సమూహాలలో సురక్షితంగా ఉండాలని, ఇతరుల వస్తువులపట్ల జాగ్రత్తలు పాటించాలని కోరారు. మంకీపాక్స్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ వైద్య మార్గదర్శకాల ప్రకారం.. వ్యాధి సోకిన వారిని 21 రోజులపాటు ఆస్పత్రిలో ఒంటరిగా ఉంచడం, వారి కుటుంబ సభ్యులను కొన్ని రోజులపాటు హోంఐసోలేషన్ లో పెట్టడం లాంటి చర్యలతో వ్యాధి వ్యాప్తిని అరికడుతున్నామన్నారు. అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, పుకార్లను నమ్మొద్దని ఆరోగ్య శాఖ కోరింది.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







