నకిలీ ప్రయాణ పత్రాల తయారీ..ఇద్దరు మహిళలకు జైలు శిక్ష
- May 30, 2022
బహ్రెయిన్: నకిలీ ప్రయాణ పత్రాలను తయారు చేసిన ఇద్దరు మహిళలకు కోర్టు జైలు శిక్ష విధించింది. రాజ్యంలో తమ బసను చట్టబద్ధం చేసేందుకు మహిళలు నకిలీ ప్రయాణ పత్రాలను సృష్టించారని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. 41 ఏళ్ల మహిళ రెండు వారాల్లో గడువు ముగిసే విజిట్ వీసాపై బహ్రెయిన్లో అడుగుపెట్టింది. అయితే ఆమె డిసెంబర్ 13వ తేదీన తిరిగి వెళ్లి రెండు రోజుల తర్వాత తిరిగి వచ్చినట్లు నకిలీ పత్రాలను రూపొందించింది. పాస్పోర్ట్ లో ఆమె ప్రయాణాన్ని ధృవీకరించే అధికారిక ముద్రను కూడా ఫోర్జరీ చేసిందని అధికారులు కోర్టుకు తెలిపారు. అలాగే 45 ఏండ్ల మరో మహిళ జనవరిలో తన స్వదేశానికి తిరుగు ప్రయాణం కోసం విమానాశ్రయానికి వచ్చిన సందర్భంగా ఆమె దగ్గరున్న పత్రాలు నకిలీవిగా అధికారులు గుర్తించారు. ఎయిర్పోర్ట్ లో జారీ చేసిన సీల్స్ ను కూడా ఫోర్జరీ చేసిందని కోర్టుకు తెలిపారు. ఆమెకు గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు సహాయం చేసినట్లు పోలీసులు విచారణలో తేలిందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







