నకిలీ ప్రయాణ పత్రాల తయారీ..ఇద్దరు మహిళలకు జైలు శిక్ష
- May 30, 2022
బహ్రెయిన్: నకిలీ ప్రయాణ పత్రాలను తయారు చేసిన ఇద్దరు మహిళలకు కోర్టు జైలు శిక్ష విధించింది. రాజ్యంలో తమ బసను చట్టబద్ధం చేసేందుకు మహిళలు నకిలీ ప్రయాణ పత్రాలను సృష్టించారని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. 41 ఏళ్ల మహిళ రెండు వారాల్లో గడువు ముగిసే విజిట్ వీసాపై బహ్రెయిన్లో అడుగుపెట్టింది. అయితే ఆమె డిసెంబర్ 13వ తేదీన తిరిగి వెళ్లి రెండు రోజుల తర్వాత తిరిగి వచ్చినట్లు నకిలీ పత్రాలను రూపొందించింది. పాస్పోర్ట్ లో ఆమె ప్రయాణాన్ని ధృవీకరించే అధికారిక ముద్రను కూడా ఫోర్జరీ చేసిందని అధికారులు కోర్టుకు తెలిపారు. అలాగే 45 ఏండ్ల మరో మహిళ జనవరిలో తన స్వదేశానికి తిరుగు ప్రయాణం కోసం విమానాశ్రయానికి వచ్చిన సందర్భంగా ఆమె దగ్గరున్న పత్రాలు నకిలీవిగా అధికారులు గుర్తించారు. ఎయిర్పోర్ట్ లో జారీ చేసిన సీల్స్ ను కూడా ఫోర్జరీ చేసిందని కోర్టుకు తెలిపారు. ఆమెకు గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు సహాయం చేసినట్లు పోలీసులు విచారణలో తేలిందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







