మందుపాతర పేలుడు కలకలం : చిత్తూరు
- April 07, 2016
చిత్తూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో మందుపాతర పేలుడు కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఎదురుగా ఉన్న వాహనాల షెడ్లో ఈ పేలుడు సంభవించింది. పెద్దఎత్తున శబ్దం రావడంతోపాటు, కొంతసేపటి వరకు పొగ కమ్మేసింది. ఈ హఠాత్పారిణామంతో న్యాయవాదులు, కక్షిదారులు పరుగులు తీశారు. ఈ ఘటనలో న్యాయవాది గుమస్తా బాలాజి కుడికాలుకు దెబ్బతగిలింది. వెంటనే ఆయనను చిత్తూరు ఆస్పత్రికి, అక్కడి నుంచి వేలూరు సీఎంసీకి తరలించారు. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ అలియాస్ చంద్రశేఖర్.. కోర్టుకు వచ్చి వెళ్లిన కొంతసేపటికే ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. గురువారం న్యాయవాదులు విధులు బహిష్కరించడంతో కోర్టులో హడావిడి కాస్త తక్కువగా ఉంది. కోర్టుల వద్ద కక్షిదారులు నిలబడి ఉన్నారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్న చింటూ, వెంకటాచలపతి, శశిధర్ (మేయర్ దంపతుల హత్య కేసులోనూ నిందితులు) కేసు వాయిదాకు వచ్చారు. ఈ కేసును న్యాయమూర్తి ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు. దీంతో వారంతా 11.40 గంటలకు బయటకు వెళ్లారు. ఆ తర్వాత 12 గంటలకు పేలుడు సంభవించింది. వాహనాల షెడ్లో న్యాయశాఖ ప్రొటోకాల్ వాహనం ఫుట్పాత్ కింద ఉంచిన మందుపాతర పేలినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో షెడ్వైపు వెళుతున్న బాలాజి గాయపడ్డారు. జిల్లా జడ్జి ఆనంద్, న్యాయమూర్తులు, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









