మందుపాతర పేలుడు కలకలం : చిత్తూరు
- April 07, 2016
చిత్తూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో మందుపాతర పేలుడు కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఎదురుగా ఉన్న వాహనాల షెడ్లో ఈ పేలుడు సంభవించింది. పెద్దఎత్తున శబ్దం రావడంతోపాటు, కొంతసేపటి వరకు పొగ కమ్మేసింది. ఈ హఠాత్పారిణామంతో న్యాయవాదులు, కక్షిదారులు పరుగులు తీశారు. ఈ ఘటనలో న్యాయవాది గుమస్తా బాలాజి కుడికాలుకు దెబ్బతగిలింది. వెంటనే ఆయనను చిత్తూరు ఆస్పత్రికి, అక్కడి నుంచి వేలూరు సీఎంసీకి తరలించారు. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ అలియాస్ చంద్రశేఖర్.. కోర్టుకు వచ్చి వెళ్లిన కొంతసేపటికే ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. గురువారం న్యాయవాదులు విధులు బహిష్కరించడంతో కోర్టులో హడావిడి కాస్త తక్కువగా ఉంది. కోర్టుల వద్ద కక్షిదారులు నిలబడి ఉన్నారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్న చింటూ, వెంకటాచలపతి, శశిధర్ (మేయర్ దంపతుల హత్య కేసులోనూ నిందితులు) కేసు వాయిదాకు వచ్చారు. ఈ కేసును న్యాయమూర్తి ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు. దీంతో వారంతా 11.40 గంటలకు బయటకు వెళ్లారు. ఆ తర్వాత 12 గంటలకు పేలుడు సంభవించింది. వాహనాల షెడ్లో న్యాయశాఖ ప్రొటోకాల్ వాహనం ఫుట్పాత్ కింద ఉంచిన మందుపాతర పేలినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో షెడ్వైపు వెళుతున్న బాలాజి గాయపడ్డారు. జిల్లా జడ్జి ఆనంద్, న్యాయమూర్తులు, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
తాజా వార్తలు
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ









