భారత్–బంగ్లాదేశ్ మధ్య ‘మిటాలి ఎక్స్ప్రెస్’ రైలు ప్రారంభం
- June 01, 2022
భారత్–బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేస్తూ..రెండు దేశాల మధ్య మరో కీలక అడుగు పడింది. భారత్లోని పశ్చిమబెంగాల్లోని న్యూ జలపాయ్గురి..నుంచి బంగ్లాదేశ్లోని ఢాకా కంటోన్మెంట్ ఏరియాను కలుపుతూ ‘మిటాలి ఎక్స్ప్రెస్’ (ప్రజారవాణా) రైలు ప్రారంభం అయింది. బుధవారం భారత రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్..బంగ్లాదేశ్ మంత్రి మహ్మద్ నూరుల్ ఇస్లాం సుజోన్లు బుధవారం ఈ ప్రత్యేక రైలును ప్రారంభించారు.ఈమేరకు బెంగాల్లోని న్యూ జలపాయ్గురి రైల్వే స్టేషన్లో జరిగిన ఈ కార్యక్రమాలో ఇరు దేశాల మంత్రులు పాల్గొన్నారు.న్యూ జలపాయ్గురి–ఢాకా కంటోన్మెంట్ మధ్య..బుధ, ఆదివారాల్లో ఈ ప్రత్యేక రైలు సేవలు అందుబాటులో ఉంటాయి.
కాగా, ఇప్పటికే భారత్–బంగ్లాదేశ్ మధ్య రెండు ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులో ఉండగా..బుధవారం మరో ప్రత్యేక రైలు ఇరుదేశాల ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కోల్కతా నుంచి బంగ్లాదేశ్లోని ఢాకా వరకు మైత్రీ రైలు, కోల్కతా నుంచి ఖుల్నా వరకు బంధన్ ఎక్స్ప్రెస్ అనే రెండు రైళ్లు ఉన్నాయి. కొత్తగా ప్రారంభించిన ‘మిటాలి ఎక్స్ప్రెస్’ భారత్లో 69 కిలోమీటర్లు, బంగ్లాదేశ్లో 526 కిలోమీటర్లు ప్రయాణించనుంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







