దివ్యాంగుల్ని అడ్డుకోవద్దు:DGCA
- June 03, 2022
న్యూ ఢిల్లీ: విమానంలో దివ్యాంగుల ప్రయాణానికి అనుమతించాలని ఆదేశించింది డైరెక్టరేట్ జనలర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA). ఏదైనా వైకల్యం ఉందనే కారణంతో విమానంలో ప్రయాణించడాన్ని అడ్డుకోవద్దని సూచించింది.దీనికి సంబంధించి తాజాగా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇటీవల రాంచీలో వైకల్యంతో ఉన్న ఒక బాలుడిని విమానంలో ప్రయాణించేందుకు ఇండిగో ఎయిర్లైన్స్ అనుమతించని సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన DGCA ఆ సంస్థకు ఐదు లక్షల జరిమానా విధించింది.ఈ అంశంపై విమానయాన సంస్థలకు కొన్ని సూచనలు చేసింది.
‘‘వైకల్యం కారణంగా ఏ వ్యక్తిని విమానంలో ప్రయాణించకుండా అడ్డుకోవడానికి వీల్లేదు. ఒకవేళ అలాంటి వ్యక్తి విమానంలో ప్రయాణించడం కారణంగా, తన ఆరోగ్యానికి హాని కలుగుతుందనుకున్నప్పుడు మాత్రమే ప్రయాణాన్ని నిరాకరించాలి. అది కూడా వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. వైద్యులు ప్రయాణికుల ఆరోగ్య స్థితిని పరిశీలించి, వాళ్లు విమానంలో ప్రయాణించవచ్చా? లేదా? అనేది నిర్ణయిస్తారు. ఆ తర్వాత సరైన నిర్ణయం తీసుకోవాలి’’ అని విమానయాన సంస్థలకు DGCA సూచించింది. ఈ అంశానికి సంబంధించి కాలానుగుణంగా నిబంధనల్లో మార్పులు తెస్తామని చెప్పింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







