పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
- June 08, 2022
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో ప్రస్తుతం కరెంటుకు తీవ్రమైన కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న విధంగానే శనివారాన్ని సెలవు దినంగా పునరుద్ధరించింది. తద్వారా విద్యుత్, ఇంధనం పెద్ద ఎత్తున ఆదా అవుతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధాని షాబాజ్ షరీఫ్ అధ్యక్షతన కాబినెట్ భేటీ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు విద్యుత్ ఆదా చేసేందుకు శనివారాన్ని పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు. గతంలోనూ ఈ విధానం అమల్లో ఉండేది. దీన్ని మళ్లీ అమల్లోకి తీసుకురావాలని కాబినెట్ నిర్ణయించింది.
దీనిపై పాక్ సమాచార ప్రసార శాఖ మంత్రి మరియం ఔరంగజేబ్ మాట్లాడుతూ.. శనివారాన్ని సెలవు దినంగా పునరుద్ధరించడం వల్ల సాలీనా 386 మిలియన్ డాలర్లు ఆదా అవుతుందని, 77 బిలియన్ డాలర్ల మేర దిగుమతి రంగానికి ఊరట కలుగుతుందని వివరించారు. అంతేకాకుండా, శుక్రవారాన్ని వర్క్ ఫ్రం హోం దినంగా ప్రకటించాలని ఇంధన రంగం సిఫారసు చేసిందని, ఒక్కరోజు ప్రజలు ఇంటి వద్ద నుంచి పనిచేయడం వల్ల ఎంతో ఇంధనం ఆదా అవుతుందని వివరించారు.
అయితే, ఈ సిఫారసు సాధ్యాసాధ్యాలపై ప్రధాని షాబాజ్ షరీఫ్ ఓ కమిటీ ఏర్పాటు చేశారని మరియం ఔరంగజేబ్ తెలిపారు. దాంతోపాటు, మార్కెట్లను వీలైనంత త్వరగా మూసివేయడం వల్ల కూడా విద్యుత్ ఆదా చేయవచ్చన్న ప్రతిపాదనలు క్యాబినెట్ సమావేశంలో తెరపైకి వచ్చాయని వివరించారు.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







