సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- October 26, 2025
హైదరాబాద్: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేరును ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సప్లో ఆయన ఫొటోను ప్రొఫైల్గా ఉంచి, వివిధ నంబర్ల నుంచి ప్రజలకు సందేశాలు పంపుతున్నారు.ఈ విషయం ఆయన దృష్టికి రాగానే జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సజ్జనార్ స్పష్టంగా పేర్కొంటూ, “నా ఫొటోతో ఉన్న వాట్సప్ అకౌంట్లు నకిలీ. వాటి నుంచి వచ్చే సందేశాలు మోసపూరితమైనవి. ఎవరూ స్పందించవద్దు. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి, 1930 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలి” అని తెలిపారు. అలాగే వ్యక్తిగత వివరాలు లేదా డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దని హెచ్చరించారు.
సజ్జనార్ ఇటీవల ఎక్స్ (Twitter) లో ఒక నకిలీ కాల్ వీడియోను పోస్టు చేస్తూ, “మీ పిల్లలను కిడ్నాప్ చేశాం” అంటూ వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పిల్లల పేర్లు చెప్పి ఏడుస్తున్న శబ్దాలు వినిపించినా ఆందోళన చెందకూడదని, వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలని అన్నారు. అతను తెలిపినదేమిటంటే – “అత్యాశ మరియు భయం ఈ రెండే సైబర్ నేరగాళ్లకు పెద్ద ఆయుధాలు. అవగాహనతో, అప్రమత్తతతోనే ఈ మోసాలను అరికట్టవచ్చు” అని హెచ్చరించారు.
సమాజమాధ్యమాల్లో పిల్లలు లేదా కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలను ఎట్టి పరిస్థితుల్లో పంచుకోవద్దని, బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు వెంటనే http://cybercrime.gov.in పోర్టల్ లేదా 1930 హెల్ప్లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









