మాస్క్ పెట్టుకోకుంటే విమానం నుంచి దించేయండి: DGCA
- June 08, 2022
న్యూఢిల్లీ: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించింది.
అంతేకాకుండా మాస్క్ ధరించని వారిని ప్రయాణానికి అనుమతించకూడదని పేర్కొంది. విమానాలు, ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలన్న ఢిల్లీ హైకోర్టు డీజీసీఏను కోరిన నేపథ్యంలో తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం కూడా డీజీసీఏ అప్రమత్తతకు కారణమైంది.ఎవరైనా ప్రయాణికులు కొవిడ్-19 ప్రొటోకాల్ పదేపదే ఉల్లంఘిస్తే వారిని ప్రత్యేకంగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ఆధారంగా ఆయా ఎయిర్పోర్టు నిర్వాహకులు ప్రయాణీకులకు జరిమానా విధించాలని, అవసరమైతే సెక్యూరిటీ ఏజేన్సీలకు అప్పగించాలని సూచించింది.అయితే ప్రత్యేక పరిస్థితుల మధ్య మాస్క్ తీసివేసేందుకు అనుమతిస్తామని పేర్కొంది
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







