మాస్క్ పెట్టుకోకుంటే విమానం నుంచి దించేయండి: DGCA
- June 08, 2022
న్యూఢిల్లీ: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించింది.
అంతేకాకుండా మాస్క్ ధరించని వారిని ప్రయాణానికి అనుమతించకూడదని పేర్కొంది. విమానాలు, ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలన్న ఢిల్లీ హైకోర్టు డీజీసీఏను కోరిన నేపథ్యంలో తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం కూడా డీజీసీఏ అప్రమత్తతకు కారణమైంది.ఎవరైనా ప్రయాణికులు కొవిడ్-19 ప్రొటోకాల్ పదేపదే ఉల్లంఘిస్తే వారిని ప్రత్యేకంగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ఆధారంగా ఆయా ఎయిర్పోర్టు నిర్వాహకులు ప్రయాణీకులకు జరిమానా విధించాలని, అవసరమైతే సెక్యూరిటీ ఏజేన్సీలకు అప్పగించాలని సూచించింది.అయితే ప్రత్యేక పరిస్థితుల మధ్య మాస్క్ తీసివేసేందుకు అనుమతిస్తామని పేర్కొంది
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







