మాస్క్ పెట్టుకోకుంటే విమానం నుంచి దించేయండి: DGCA
- June 08, 2022
న్యూఢిల్లీ: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించింది.
అంతేకాకుండా మాస్క్ ధరించని వారిని ప్రయాణానికి అనుమతించకూడదని పేర్కొంది. విమానాలు, ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలన్న ఢిల్లీ హైకోర్టు డీజీసీఏను కోరిన నేపథ్యంలో తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం కూడా డీజీసీఏ అప్రమత్తతకు కారణమైంది.ఎవరైనా ప్రయాణికులు కొవిడ్-19 ప్రొటోకాల్ పదేపదే ఉల్లంఘిస్తే వారిని ప్రత్యేకంగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ఆధారంగా ఆయా ఎయిర్పోర్టు నిర్వాహకులు ప్రయాణీకులకు జరిమానా విధించాలని, అవసరమైతే సెక్యూరిటీ ఏజేన్సీలకు అప్పగించాలని సూచించింది.అయితే ప్రత్యేక పరిస్థితుల మధ్య మాస్క్ తీసివేసేందుకు అనుమతిస్తామని పేర్కొంది
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







