ఘోర రైలు ప్రమాదం..17 మంది మృతి

- June 08, 2022 , by Maagulf
ఘోర రైలు ప్రమాదం..17 మంది మృతి

ఇరాన్‌: తూర్పు ఇరాన్‌లో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో 17 మంది మరణించారని, 50 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

దాదాపు 350 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న రైలు.. ఎడారి నగరమైన తబాస్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున చీకటిలో రైలులోని ఏడు క్యారేజీలలో నాలుగు పట్టాలు తప్పినట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ నివేదించింది. ఘటనా స్థలానికి అంబులెన్స్‌లు, హెలికాప్టర్లతో రెస్క్యూ టీమ్‌లు చేరుకున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com