నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ పై కేసులు
- June 09, 2022
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు బీజేపీ బహిష్కృత నేతలైన నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ తదితరులపై కేసు నమోదు చేశారు. విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న అభియోగాలను వారిపై మోపారు. ద్వేషపూరిత వ్యాఖ్యలతో ప్రజల్లో ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారంటూ ఆరోపించారు. ఢిల్లీ పోలీసు ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ విభాగం (ప్రత్యేక సెల్) ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేతలు వివాదాస్పదంగా మాట్లాడడం తెలిసిందే.
‘‘వివిధ మతాలకు సంబంధించిన వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. తప్పుడు, అసత్య సమాచారాన్ని ప్రోత్సహించే విషయంలో సోషల్ మీడియా సంస్థల పాత్రపైనా విచారణ చేయనున్నాం’’ అని ఓ సీనియర్ అధికారి తెలిపారు. బీజేపీ నుంచి సస్పెన్షన్ కు గురైన నుపుర్ శర్హ, నవీన్ కుమార్ జిందాల్, షదాబ్ చౌహాన్, సబా నఖ్వి, మౌలానా ముఫ్తి నదీమ్, అద్దుర్ రెహమాన్, గులామ్ అన్సారీ, అనిల్ కుమార్ మీనా, పూజా షకున్ పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







