జీసీసీ నివాసితులకు కొత్త వీసా విధానం: సౌదీ అరేబియా
- June 10, 2022
రియాద్: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) నివాసితుల కోసం సౌదీ అరేబియా త్వరలో కొత్త వీసా పథకాన్ని ప్రవేశపెడుతుందని పర్యాటక మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ వెల్లడించారు. 2019లో కింగ్డమ్ ప్రారంభించిన పర్యాటక వీసాలు ఇప్పటికీ ఉన్నాయని, పర్యాటకం కోసం వచ్చే వారికి నిర్దిష్ట పరిమితులు లేవని అల్-ఖతీబ్ చెప్పారు. 2021లో రాజ్యంలో 64 మిలియన్ల దేశీయ పర్యటనలు జరిగాయని, అయితే విదేశాల నుండి వచ్చిన సందర్శకుల సంఖ్య గత సంవత్సరం 5 మిలియన్లకు చేరుకుందన్నారు. మహమ్మారి సమయంలో పర్యాటకుల శాతం 40 శాతం తగ్గిందన్నారు. దిరియా ప్రాజెక్ట్ లోని అల్-బుజైరి ప్రాంతాన్ని ఈ సంవత్సరం తెరవనున్నట్లు అల్-ఖతీబ్ తెలిపారు. 2019లో ఉద్యోగాల కల్పనలో పర్యాటక రంగం సహకారం 3 శాతంగా ఉందని, 2030 నాటికి 10 శాతానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. సౌదీలో ఉద్యోగ రంగం 2019 నుండి ఇప్పటి వరకు 15 శాతం పెరిగి 820,000 ఉద్యోగాలకు చేరుకుందన్నారు. అలాగే 2019లో జీడీపీలో 3 శాతంగా ఉన్న పర్యాటక రంగ ఆదాయాన్ని.. 2030 నాటికి 10 శాతానికి చేర్చే లక్ష్యంతో ముందుకుపోతున్నట్లు అల్-ఖతీబ్ పేర్కొన్నారు. దీనికోసం 2030 నాటికి $200 బిలియన్ల కంటే ఎక్కువ ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
తాజా వార్తలు
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!