జీసీసీ నివాసితులకు కొత్త వీసా విధానం: సౌదీ అరేబియా
- June 10, 2022
రియాద్: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) నివాసితుల కోసం సౌదీ అరేబియా త్వరలో కొత్త వీసా పథకాన్ని ప్రవేశపెడుతుందని పర్యాటక మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ వెల్లడించారు. 2019లో కింగ్డమ్ ప్రారంభించిన పర్యాటక వీసాలు ఇప్పటికీ ఉన్నాయని, పర్యాటకం కోసం వచ్చే వారికి నిర్దిష్ట పరిమితులు లేవని అల్-ఖతీబ్ చెప్పారు. 2021లో రాజ్యంలో 64 మిలియన్ల దేశీయ పర్యటనలు జరిగాయని, అయితే విదేశాల నుండి వచ్చిన సందర్శకుల సంఖ్య గత సంవత్సరం 5 మిలియన్లకు చేరుకుందన్నారు. మహమ్మారి సమయంలో పర్యాటకుల శాతం 40 శాతం తగ్గిందన్నారు. దిరియా ప్రాజెక్ట్ లోని అల్-బుజైరి ప్రాంతాన్ని ఈ సంవత్సరం తెరవనున్నట్లు అల్-ఖతీబ్ తెలిపారు. 2019లో ఉద్యోగాల కల్పనలో పర్యాటక రంగం సహకారం 3 శాతంగా ఉందని, 2030 నాటికి 10 శాతానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. సౌదీలో ఉద్యోగ రంగం 2019 నుండి ఇప్పటి వరకు 15 శాతం పెరిగి 820,000 ఉద్యోగాలకు చేరుకుందన్నారు. అలాగే 2019లో జీడీపీలో 3 శాతంగా ఉన్న పర్యాటక రంగ ఆదాయాన్ని.. 2030 నాటికి 10 శాతానికి చేర్చే లక్ష్యంతో ముందుకుపోతున్నట్లు అల్-ఖతీబ్ పేర్కొన్నారు. దీనికోసం 2030 నాటికి $200 బిలియన్ల కంటే ఎక్కువ ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







