జీసీసీ నివాసితులకు కొత్త వీసా విధానం: సౌదీ అరేబియా
- June 10, 2022
రియాద్: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) నివాసితుల కోసం సౌదీ అరేబియా త్వరలో కొత్త వీసా పథకాన్ని ప్రవేశపెడుతుందని పర్యాటక మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ వెల్లడించారు. 2019లో కింగ్డమ్ ప్రారంభించిన పర్యాటక వీసాలు ఇప్పటికీ ఉన్నాయని, పర్యాటకం కోసం వచ్చే వారికి నిర్దిష్ట పరిమితులు లేవని అల్-ఖతీబ్ చెప్పారు. 2021లో రాజ్యంలో 64 మిలియన్ల దేశీయ పర్యటనలు జరిగాయని, అయితే విదేశాల నుండి వచ్చిన సందర్శకుల సంఖ్య గత సంవత్సరం 5 మిలియన్లకు చేరుకుందన్నారు. మహమ్మారి సమయంలో పర్యాటకుల శాతం 40 శాతం తగ్గిందన్నారు. దిరియా ప్రాజెక్ట్ లోని అల్-బుజైరి ప్రాంతాన్ని ఈ సంవత్సరం తెరవనున్నట్లు అల్-ఖతీబ్ తెలిపారు. 2019లో ఉద్యోగాల కల్పనలో పర్యాటక రంగం సహకారం 3 శాతంగా ఉందని, 2030 నాటికి 10 శాతానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. సౌదీలో ఉద్యోగ రంగం 2019 నుండి ఇప్పటి వరకు 15 శాతం పెరిగి 820,000 ఉద్యోగాలకు చేరుకుందన్నారు. అలాగే 2019లో జీడీపీలో 3 శాతంగా ఉన్న పర్యాటక రంగ ఆదాయాన్ని.. 2030 నాటికి 10 శాతానికి చేర్చే లక్ష్యంతో ముందుకుపోతున్నట్లు అల్-ఖతీబ్ పేర్కొన్నారు. దీనికోసం 2030 నాటికి $200 బిలియన్ల కంటే ఎక్కువ ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







