భారత్-బంగ్లాదేశ్ దేశాల మధ్య బస్సు సర్వీసులు మళ్లీ షురూ
- June 10, 2022
భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల మధ్య బస్సు సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో రెండేళ్ల క్రితం ఇరు దేశాల మధ్య ఈ బస్సు సర్వీసులను నిలిపేసిన విషయం తెలిసిందే. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ సర్వీసులను శుక్రవారం నుంచి ప్రారంభించారు. అగర్తలా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్-ఆఖావ్డా-హరిదాస్పూర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్-బేనాపూల్ మధ్య ఈ బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని బంగ్లాదేశ్లోని భారత హై కమిషన్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.
అలాగే, ఢాకా-కోల్కతా-ఢాక్ బస్సు సర్వీసు కూడా శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమైందని వివరించింది. భారత్-బంగ్లాదేశ్ మధ్య మే 29 నుంచి రైలే సర్వీసు కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య రైలు సర్వీసులు కరోనా కారణంగా 2020 మార్చి నుంచి నిలిచిపోయాయి. బంధన్ ఎక్స్ప్రెస్ కోల్కతా-ఖుల్నా మధ్య, మైత్రీ ఎక్స్ప్రెస్ కోల్కతా-ఢాక్ మధ్య సర్వీసులు కొనసాగిస్తాయి. బస్సు, రైలు సర్వీసులు పునఃప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యంగా చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







