చార్మినార్ వద్ద టెన్షన్ వాతావరణం
- June 10, 2022
హైదరాబాద్: హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా పాతబస్తీలో ముస్లీంలు నిరసన వ్యక్తం చేశారు. ప్రార్థనలు ముగిశాక ముస్లీంలు ర్యాలీగా బయల్దేరారు. నుపుర్ శర్మ, నిత్యానంద, రాజాసింగ్ లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పాతబస్తీలో పోలీసులు భారీగా మొహరించారు.
చార్మినార్, మక్కామసీదు, కాలపత్తార్, మెహిదీపట్నం, చాంద్రాయణగుట్ట, షాహీన్నగర్, సైదాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో ముస్లింలు నిరసనలు వ్యక్తం చేశారు. ముస్లింల నిరసనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పాతబస్తీలో పోలీసులు భారీగా మోహరించారు. చార్మినార్ వద్ద పోలీసు ఉన్నతాధికారులు బందోబస్తును పర్యవేక్షించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







