ఫిఫా వరల్డ్ కప్.. హోస్ట్ చేయడానికి నమోదు తప్పనిసరి
- June 11, 2022
ఖతార్: ఫిఫా(FIFA) వరల్డ్ కప్ ఖతార్ 2022 కోసం మ్యాచ్ టిక్కెట్లు, హయ్యా డిజిటల్ కార్డ్ ని ఆమోదించిన స్నేహితులు, కుటుంబాలను హోస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్న నివాసితులు ప్రత్యామ్నాయ వసతి ట్యాబ్ ద్వారా హయ్యా పోర్టల్లో తమ ఆస్తిని నమోదు చేసుకోవాలని అధికార వర్గాలు తెలిపాయి. నవంబర్ 21 నుండి డిసెంబర్ 18 వరకు FIFA ప్రపంచ కప్ ఖతార్ 2022 జరగనున్న విషయం తెలిసింది. ఈ మెగా టోర్నమెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు దోహాకు చేరుకుంటారు. ఎనిమిది స్టేడియంలలో జరిగే ఈ ఈవెంట్లో వేలాది మంది అభిమానులు ఖతార్లో కుటుంబం, స్నేహితులతో కలిసి ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. టోర్నమెంట్ కోసం ఖతార్కు వెళ్లే ప్రతి అభిమాని హయ్యా డిజిటల్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఖతార్కు ప్రవేశ అనుమతిగా పని చేస్తుంది. ఇది మ్యాచ్ రోజులలో ఉచిత ప్రజా రవాణాతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మ్యాచ్లకు హాజరు కావాలనుకునే ఖతార్ నివాసితులు కూడా హయ్యా కోసం దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. టిక్కెట్టు పొందిన కుటుంబం, స్నేహితులను హోస్ట్ చేయాలనుకునే స్థానిక నివాసితులు.. మ్యాచ్లకు హాజరుకానివారు హయ్యా కోసం దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. అలాగే టోర్నమెంట్ సమయంలో ఖతార్లోకి ప్రవేశించాలనుకునే ఖతార్ పౌరులు/నివాసులు హయ్యా కోసం దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







