భారత్ కరోనా అప్డేట్

- June 11, 2022 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా రోజువారీ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఏడు వేలకుపైగా నమోదవుతుండగా, నేడు ఆ సంఖ్య 8 వేలు దాటింది. శుక్రవారం దేశవ్యాప్తంగా 3.44 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా.. 8,329 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 2.41 శాతంగా ఉంది. అదే సమయంలో ఈ మహమ్మారి నుంచి 4,216 మంది కోలుకున్నారు. ఇక ఈ వైరస్ కు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు దేశవ్యాప్తంగా 40,370గా ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ప్రజలకు 194.92 కోట్ల వ్యాక్సిన్ లను ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో నిన్న 3,081 మంది కరోనా బారిన పడితే, అందులో ముంబైలోనే 1,956 కేసులు వచ్చాయి. కేరళలో 2,415 కేసులు, ఢిల్లీలో 655 కేసులు వచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com