మురుగు నీటి గుంతలో పడి చిన్నారి మృతి
- June 14, 2022
మస్కట్: ఓ చిన్నారి మురుగు నీటి గుంతలో పడి మృతి చెందింది. ఈ ఘటనపై సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) చర్యలు చేపట్టింది. ఒక ఇంట్లో మురుగునీటి గొయ్యిలో చిన్నారి పడిపోయిన సమాచారం అందగానే నార్త్ అల్ బతినా గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్లోని రెస్క్యూ టీమ్లు సువైఖ్లోని విలాయత్లోని ఘటనా జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయని సీడీఏఏ తెలిపింది. అనంతరం ఇంట్లోని మురుగునీటి గొయ్యిలో పడిపోయిన చిన్నారిని బృందాలు బయటకు తీశాయని.. కానీ అప్పటికే ఆ చిన్నారి చనిపోయినట్లు పేర్కొంది. చిన్నారుల భద్రతను తల్లిదండ్రులు పర్యవేక్షించాలని, ఇళ్లలో ప్రమాదకర అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!







