ఎయిరిండియాకు రూ.10 లక్షల జరిమానా విధించిన DGCA
- June 14, 2022
ముంబై: చెల్లుబాటు అయ్యే టికెట్లు ఉన్నా విమాన ప్రయాణానికి అనుమతించలేదంటూ ఎయిరిండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) రూ.10 లక్షల జరిమానా విధించింది. విమానంలో ఎక్కనివ్వకపోవడమే కాకుండా, వారికి చెల్లించాల్సిన నష్ట పరిహారాన్ని కూడా అందించకపోవడం పట్ల డీజీసీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీ ఎయిర్ పోర్టుల్లో తమ నిఘా విభాగం అధికారులు తనిఖీలు చేశారని, ఎయిరిండియా తప్పిదాలు గుర్తించామని డీజీసీఏ వెల్లడించింది.
కొన్ని సందర్భాల్లో ప్రయాణికులకు నష్ట పరిహారం తప్పనిసరిగా చెల్లించాలని నిబంధనలు పేర్కొంటున్నా, ఎయిరిండియా ఆ నిబంధనలను పాటించలేదని డీజీసీఏ ఆరోపించింది. దీనిపై ఎయిరిండియాకు షోకాజ్ నోటీసు పంపామని, వ్యక్తిగత విచారణ సైతం ఏర్పాటు చేశామని తెలిపింది. ఎయిరిండియాలో ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించే విధానం లేదని తెలిసిందని కూడా డీజీసీఏ పేర్కొంది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఎయిరిండియాకు రూ.10 లక్షల జరిమానా విధించామని ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







