కువైట్ లోని భారతీయులపై ప్రశంసల వర్షం..
- June 15, 2022
కువైట్ సిటీ: కువైట్ లోని భారత రాయబారి సిబి జార్జి ఆ దేశంలోని ప్రవాస భారతీయులపై ప్రశంసల వర్షం కురిపించారు.తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. భారతీయులను హీరోలుగా అభివర్ణించారు.ఎన్నారైలు చేస్తున్న సేవను కొనియాడారు.
జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కువైట్ లోని భారత రాయబార కార్యాలయంలో ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్తో కలిసి రక్తదాన శిబిరాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన సిబి జార్జ్ మాట్లాడారు.కువైట్ లో ఉన్న రక్తదాతల్లో అత్యధికులు భారతీయ పౌరులే ఉన్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా యువకులు రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్న భారతీయులను ఆయన హీరోలుగా అభివర్ణించారు.అంతేకాకుండా భారతీయుల సేవను కువైట్ అధికారులు కూడా గుర్తించి, ప్రశంసించినట్టు చెప్పారు.రక్తదానం గురించి భారతీయుల్లో అవగాహన పెంచి, ప్రోత్సహిస్తున్న ఇండియన్ కమ్యూనిటీలను కూడా ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







