చేపల వేట: చట్టాన్ని ఉల్లంఘించిన పలువురి అరెస్ట్

- June 17, 2022 , by Maagulf
చేపల వేట: చట్టాన్ని ఉల్లంఘించిన పలువురి అరెస్ట్

మస్కట్: 20 మందికి పైగా కార్మికుల్ని దోఫార్ గవర్నరేట్‌లో ఫిషింగ్ చట్టాన్ని ఉల్లంఘించిన కారణంగా అరెస్ట్ చేయడం జరిగింది.జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చరల్ వెల్త్, ఫిషరీస్ మరియు వాటర్ రిసోర్సెస్ (గవర్నరేట్ ఆఫ్ దోఫార్) వెల్లడించిన వివరాల ప్రకారం తనిఖీ బృందాలు, పలు ఉల్లంఘనల్ని గుర్తించి, చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.నెంబర్లు లేకుండా నాలుగు ఫిషింగ్ వెజల్స్‌లో వెళుతున్న 18 మందిని అరెస్ట్ చేశారు. లైసెన్సు లేకుండా కేజెస్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అరెస్టయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com