చట్టవిరుద్ధమైన కంటెంట్ ప్రచురణ.. Dh2 మిలియన్ల జరిమానా
- June 18, 2022
యూఏఈ: చట్టవిరుద్ధమైన కంటెంట్ లేదా తప్పుడు డేటాను ప్రచురించిన వారికి జైలు శిక్ష, 2 మిలియన్ దిర్హామ్ల వరకు జరిమానా విధించబడుతుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. పుకార్లు, సైబర్క్రైమ్లను ఎదుర్కోవడంపై ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 34 2021లోని ఆర్టికల్ 55 ప్రకారం శిక్ష విధించబడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన సోషల్ మీడియా ఖాతాలలో ప్రచురించిన అవగాహన వీడియోలో పేర్కొంది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏదైనా చట్టవిరుద్ధమైన కంటెంట్ ప్రచురించడం చేస్తే Dh2,000,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అథారిటీ పేర్కొంది. అభ్యంతరకరమైన కంటెంట్ని కలిగి ఉన్న ఆన్లైన్ ఖాతా లేదా వెబ్సైట్ ఆపరేషన్ను నిర్వహించే లేదా పర్యవేక్షించే ఏ వ్యక్తికైనా అదే పెనాల్టీ వర్తిస్తుందని వీడియోలో అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







