రూ.86 లక్షల బంగారం స్మగ్లింగ్.. హైదరాబాద్లో కువైట్ మహిళ పట్టివేత
- June 18, 2022
కువైట్: కువైట్ నుండి ఇండియాలోని హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న సుమారు 86 లక్షల రూపాయల విలువైన 1.646 కిలోల బంగారాన్ని హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జిఐఎ) కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుండి J9403 విమానంలో వచ్చిన ఒక మహిళా ప్రయాణీకురాలి నుండి బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. బంగారాన్ని పేస్ట్ రూపంలో షూ లోపల సాక్స్, నల్లటి ప్లాస్టిక్ కవరింగ్లో దాచి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మహిళను అరెస్టు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని సంబంధిత వర్గాలు తెలియజేశాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







