రూ.86 లక్షల బంగారం స్మగ్లింగ్.. హైదరాబాద్లో కువైట్ మహిళ పట్టివేత
- June 18, 2022
కువైట్: కువైట్ నుండి ఇండియాలోని హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న సుమారు 86 లక్షల రూపాయల విలువైన 1.646 కిలోల బంగారాన్ని హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జిఐఎ) కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుండి J9403 విమానంలో వచ్చిన ఒక మహిళా ప్రయాణీకురాలి నుండి బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. బంగారాన్ని పేస్ట్ రూపంలో షూ లోపల సాక్స్, నల్లటి ప్లాస్టిక్ కవరింగ్లో దాచి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మహిళను అరెస్టు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని సంబంధిత వర్గాలు తెలియజేశాయి.
తాజా వార్తలు
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!







