రూ.86 లక్షల బంగారం స్మగ్లింగ్.. హైదరాబాద్లో కువైట్ మహిళ పట్టివేత
- June 18, 2022
కువైట్: కువైట్ నుండి ఇండియాలోని హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న సుమారు 86 లక్షల రూపాయల విలువైన 1.646 కిలోల బంగారాన్ని హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జిఐఎ) కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుండి J9403 విమానంలో వచ్చిన ఒక మహిళా ప్రయాణీకురాలి నుండి బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. బంగారాన్ని పేస్ట్ రూపంలో షూ లోపల సాక్స్, నల్లటి ప్లాస్టిక్ కవరింగ్లో దాచి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మహిళను అరెస్టు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని సంబంధిత వర్గాలు తెలియజేశాయి.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







