'సరైనోడు' చిత్రం ఆడియో విజయోత్సవ వేడుకలు..

- April 10, 2016 , by Maagulf
'సరైనోడు' చిత్రం ఆడియో విజయోత్సవ వేడుకలు..

 'సరైనోడు' చిత్రం  ఆడియో విజయోత్సవ వేడుకలు విశాఖపట్నంలో ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు జరగనున్నట్లు ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను తెలియజేశారు. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆడియో విజయోత్సవం ఆదివారం ఆర్‌కె బీచ్‌ రోడ్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను బోయపాటి శ్రీను సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరైనోడు. ఈ చిత్రంలో అర్జున్‌ సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ నటించారు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి థమన్‌ సంగీతమందించారు. ఈ నెలలో సరైనోడు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com