59 కేసులను ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసిన నజాహా

- June 21, 2022 , by Maagulf
59 కేసులను ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసిన నజాహా

కువైట్: 59 కేసులను ప్రాసిక్యూషన్ కు పబ్లిక్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) రిఫర్ చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు నివేదించిన కేసులలో ప్రజాధనాన్ని వృధా చేసిన నేరాలకు సంబంధించిన అభియోగాలు(27 కేసులు) అగ్రస్థానంలో ఉన్నాయి. పబ్లిక్ మనీ దొంగతనం(12), ఫోర్జరీ రిపోర్ట్స్ (11), అధికారుల పనిని అడ్డుకోవడం(3), లాభదాయక ఆరోపణలు(2), లంచం, దోపిడీ(2), కస్టమ్స్ ఎగవేత(1) తర్వాతి స్థానంలో ఉన్నాయి. విజిల్‌బ్లోయర్‌ల కోసం అన్ని రకాల రక్షణ, గోప్యత, ఫోన్, ఈ-మెయిల్ లేదా వ్యక్తిగత హాజరు ద్వారా కమ్యూనికేషన్‌లను స్వీకరించే ప్రక్రియలను అమలు చేయడంతోపాటు ఆయా కేసులకు సంబంధించిన సాక్ష్యాలను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు సూచిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com