ప్రవాస టీచర్ల కు ముఖ్య గమనిక
- June 23, 2022
కువైట్ సిటీ: కువైట్ లోని ప్రవాస టీచర్ల కోసం విద్యా మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రవాస ఉపాధ్యాయులు తమ రెసిడెన్సీ పర్మిట్లను రెన్యువల్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ట్రాఫిక్ జరిమానాలు ఉంటే చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది.లేనిపక్షంలో రెసిడెన్సీ రెన్యువల్ చేసుకోవడం కుదరదని స్పష్టం చేసింది.ఈ మేరకు అక్కడి స్కూళ్లకు ఓ సర్క్యూలర్ జారీ చేసింది. స్కూళ్లలో పనిచేస్తున్న ప్రవాస టీచర్లు, నాన్-టీచింగ్ సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేయాలని సర్క్యూలర్లో పేర్కొంది.అలాగే ప్రవాసులు తమ రెసిడెన్సీ రెన్యువల్ కోసం పాటించాల్సిన నిబంధనలు తెలియజేసింది.
రెసిడెన్సీ రెన్యువల్ కోసం ప్రవాస టీచర్లు పాటించాల్సిన నిబంధనలు..
1. గడువు ముగియడానికి 3 నెలల ముందు రెసిడెన్సీ రెన్యూవ్ చేయబడదు
2. టీచర్లు ముందుగా విద్యాశాఖ వెబ్సైట్ https://moe.edu.kw.ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి
3. అపాయింట్మెంట్లో ఇచ్చిన తేదీకి కచ్చితంగా ఎవరైతే తమ రెసిడెన్సీని రెన్యువల్ చేసుకోవాలనుకుంటున్నారో వారే స్వయంగా సంబంధిత కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది
4. రెసిడెన్సీ రెన్యువల్ కోసం కావాల్సిన ధృవపత్రాలు
- స్కూల్ యాజమాన్యం అప్రూవ్ చేసిన Form No. 1, దానిపై స్కూల్ స్టాంప్ తప్పకుండా ఉండాలి.
- ఒర్జినల్ పాస్పోర్ట్, సివిల్ ఐడీలతో పాటు వాటి జిరాక్స్ కాపీలు కూడా తీసుకెళ్లాలి.
- ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన కాపీలు(ఒకవేళ ఉంటే).
- కువైట్ లోకి ప్రవేశించిన చివరి స్టాంప్ కాపీ.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









