బిడ్డను వదిలేసిన మహిళను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు
- June 23, 2022
షార్జా: రెండు నెలల శిశువును షార్జా లోని అనాథ ఆశ్రమం(ఛారిటీ సెంటర్) లో వదిలేసిన మహిళను కేవలం 5గంటల్లోనే శిశు సంరక్షణ కేంద్రం సహకారంతో షార్జా నేర పరిశోధన శాఖకు చెందిన పోలీసులు అరెస్ట్ చేశారు.
సాయంత్రం 5 గంటల సమయంలో రెండు నెలల శిశువును అనాథ ఆశ్రమంలో వదిలి వెళ్లినట్లు గుర్తించిన ఆశ్రమ నిర్వహకులు షార్జా పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేయడం జరిగింది.
ఫిర్యాదు అందుకున్న వెంటనే నగరంలోని సీసి కెమెరా ఫుటేజ్ ను పరిశీలించగా బిడ్డ తల్లి ఆశ్రమం ప్రధాన కార్యాలయంలో ప్రవేశించి అక్కడ తన బిడ్డను వదిలేసి గుట్టు చప్పుడు కాకుండా అక్కడ నుంచి వెళ్లిపోవడం జరిగింది.ఈ దృశ్యాలన్నీ సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు అధికారుల బృందం మరియు శిశు సంరక్షణ కేంద్రం ప్రతినిధులు ఆశ్రమంలో ఉన్న బిడ్డను పరిశీలించి మెరుగైన వైద్య పరీక్షలు నిర్వహించడానికి అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు.
అలాగే మరోవైపు ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు నిందితురాలి కోసం అన్వేషణ మొదలు 5గంటల్లోనే ఆమె ఆచూకీ లభ్యమైంది. పోలీసుల విచారణలో అక్రమ సంబంధం కారణంగా బిడ్డకు జన్మనివ్వడంతో ఆమె ఆశ్రమంలో వదిలి వెళ్లినట్లు సమాచారం. అలాగే ఆమె పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భద్రతా అధికారి కల్నల్ ఒమర్ బు అల్ జూద్ తెలిపారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









