బిడ్డను వదిలేసిన మహిళను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు
- June 23, 2022షార్జా: రెండు నెలల శిశువును షార్జా లోని అనాథ ఆశ్రమం(ఛారిటీ సెంటర్) లో వదిలేసిన మహిళను కేవలం 5గంటల్లోనే శిశు సంరక్షణ కేంద్రం సహకారంతో షార్జా నేర పరిశోధన శాఖకు చెందిన పోలీసులు అరెస్ట్ చేశారు.
సాయంత్రం 5 గంటల సమయంలో రెండు నెలల శిశువును అనాథ ఆశ్రమంలో వదిలి వెళ్లినట్లు గుర్తించిన ఆశ్రమ నిర్వహకులు షార్జా పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేయడం జరిగింది.
ఫిర్యాదు అందుకున్న వెంటనే నగరంలోని సీసి కెమెరా ఫుటేజ్ ను పరిశీలించగా బిడ్డ తల్లి ఆశ్రమం ప్రధాన కార్యాలయంలో ప్రవేశించి అక్కడ తన బిడ్డను వదిలేసి గుట్టు చప్పుడు కాకుండా అక్కడ నుంచి వెళ్లిపోవడం జరిగింది.ఈ దృశ్యాలన్నీ సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు అధికారుల బృందం మరియు శిశు సంరక్షణ కేంద్రం ప్రతినిధులు ఆశ్రమంలో ఉన్న బిడ్డను పరిశీలించి మెరుగైన వైద్య పరీక్షలు నిర్వహించడానికి అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు.
అలాగే మరోవైపు ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు నిందితురాలి కోసం అన్వేషణ మొదలు 5గంటల్లోనే ఆమె ఆచూకీ లభ్యమైంది. పోలీసుల విచారణలో అక్రమ సంబంధం కారణంగా బిడ్డకు జన్మనివ్వడంతో ఆమె ఆశ్రమంలో వదిలి వెళ్లినట్లు సమాచారం. అలాగే ఆమె పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భద్రతా అధికారి కల్నల్ ఒమర్ బు అల్ జూద్ తెలిపారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం