దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో జాక్పాట్ కొట్టిన భారతీయుడు
- June 23, 2022దుబాయ్: దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్లో 62 ఏళ్ల ఓ భారత వ్యక్తికి అదృష్టం కలిసి రావడంతో జాక్పాట్ కొట్టాడు. ఒమన్లో ఉండే జాన్ వర్ఘీస్ అనే భారతీయుడు బుధవారం దుబాయ్ ఎయిర్ పోర్టులో నిర్వహించిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రా లో ఏకంగా 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు.మిలీనియం మిలియనీర్ సిరీస్ నం. 392లో భాగంగా అతడు మే 29న ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నం. 09827కు ఈ జాక్పాట్ తగిలింది. కాగా, వర్ఘీస్ గత ఆరేళ్ల నుంచి క్రమం తప్పకుండా ర్యాఫిల్ లో లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నాడు. కేరళ రాష్ట్రానికి చెందిన అతడు 35 ఏళ్ల నుంచి అరబ్ దేశాల్లోనే ఉంటున్నాడు. ప్రస్తుతం మస్కట్లోని పాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అనే కంపెనీలో జనరల్ మేనేజర్గా పని చేస్తున్నాడు.
దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్లో ఒక మిలియన్ డాలర్లు గెలవడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. కలలో కూడా ఇంత భారీ మొత్తం గెలుస్తానని అనుకోలేదని వర్ఘీస్ పేర్కొన్నాడు. ఈ నగదులో కొంత భాగాన్ని తన ఇద్దరు పిల్లల చదువుకు, మరికొంత భాగాన్ని తన భవిష్యత్ ప్రణాళికకు ఉపయోగిస్తానని చెప్పుకొచ్చాడు. అలాగే కొంత మొత్తాన్ని చారిటీకి వినియోగిస్తానని తెలిపాడు. ఈ సందర్భంగా లాటరీ నిర్వాహకులకు వర్ఘీస్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాడు.కాగా, 1999లో ప్రారంభమైన దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్లో ఇప్పటి వరకు మొత్తం 192 మంది భారతీయులు విజేతలుగా నిలిచారు. ఇందులో వర్ఘీస్ 192వ ఇండియన్.
తాజా వార్తలు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!
- మరోసారి బహిరంగ క్షమాపణలు తెలిపిన రాందేవ్ బాబా
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ