దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో జాక్పాట్ కొట్టిన భారతీయుడు
- June 23, 2022
దుబాయ్: దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్లో 62 ఏళ్ల ఓ భారత వ్యక్తికి అదృష్టం కలిసి రావడంతో జాక్పాట్ కొట్టాడు. ఒమన్లో ఉండే జాన్ వర్ఘీస్ అనే భారతీయుడు బుధవారం దుబాయ్ ఎయిర్ పోర్టులో నిర్వహించిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రా లో ఏకంగా 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు.మిలీనియం మిలియనీర్ సిరీస్ నం. 392లో భాగంగా అతడు మే 29న ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నం. 09827కు ఈ జాక్పాట్ తగిలింది. కాగా, వర్ఘీస్ గత ఆరేళ్ల నుంచి క్రమం తప్పకుండా ర్యాఫిల్ లో లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నాడు. కేరళ రాష్ట్రానికి చెందిన అతడు 35 ఏళ్ల నుంచి అరబ్ దేశాల్లోనే ఉంటున్నాడు. ప్రస్తుతం మస్కట్లోని పాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అనే కంపెనీలో జనరల్ మేనేజర్గా పని చేస్తున్నాడు.
దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్లో ఒక మిలియన్ డాలర్లు గెలవడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. కలలో కూడా ఇంత భారీ మొత్తం గెలుస్తానని అనుకోలేదని వర్ఘీస్ పేర్కొన్నాడు. ఈ నగదులో కొంత భాగాన్ని తన ఇద్దరు పిల్లల చదువుకు, మరికొంత భాగాన్ని తన భవిష్యత్ ప్రణాళికకు ఉపయోగిస్తానని చెప్పుకొచ్చాడు. అలాగే కొంత మొత్తాన్ని చారిటీకి వినియోగిస్తానని తెలిపాడు. ఈ సందర్భంగా లాటరీ నిర్వాహకులకు వర్ఘీస్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాడు.కాగా, 1999లో ప్రారంభమైన దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్లో ఇప్పటి వరకు మొత్తం 192 మంది భారతీయులు విజేతలుగా నిలిచారు. ఇందులో వర్ఘీస్ 192వ ఇండియన్.
తాజా వార్తలు
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీపై ఈగల్ పోలీసుల దాడులు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం









